కేజ్రీ చీప్ ట్రిక్స్!

 

చీప్ ట్రిక్స్ ప్రదర్శించడంలో రాజకీయ నాయకులు ఏనాడో ముదిరిపోయారు. లేటెస్ట్ గా రాజకీయాల్లో ప్రవేశించిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్ ముదురు రాజకీయ నాయకుల కంటే మరింత ముదిరిపోయాడు. ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని ఎక్కడానికి ముందు.. ముఖ్యమంత్రి పదవి ఊడిపోయిన తర్వాత కేజ్రీవాల్ ప్రదర్శించిన చీప్ ట్రిక్స్ తో ఒక పెద్ద గ్రంథం రాయొచ్చు. నిన్నగాక మొన్న కేజ్రీవాల్ ముఖం మీద ఎవరో వ్యక్తి ఇంకు చల్లాడు. ముఖం నిండా ఇంకు పెట్టుకునే కేజ్రీవాల్ ఓ మీటింగ్‌లో పాల్గొని భారీ స్థాయిలో ప్రసంగించాడు. ఇలాంటి సంఘటనలు తనను ఆపలేవని భారీ డైలాగ్స్ కొట్టాడు. మామూలుగా అయితే జనానికి క్రేజీవాల్ మీద బోలెడంత సానుభూతి పుట్టి వుండేది. అయితే కేజ్రీగారి క్రేజీ పనుల గురించి జనానికి ఇప్పటికే బాగా తెలిసిపోవడంతో ఈ సంఘటనని లైట్‌గా తీసుకున్నారు.

 

ఆ ఇంకు ఎవరో బయటివాళ్ళు చల్లారో, జనంలో సానుభూతి కొట్టేయడానికి కేజ్రీవాలే చల్లించుకున్నాడో ఆ కేజ్రీవాల్‌కే తెలియాలి. ఇంకు ట్రిక్ పనిచేయాలేదని అనుకున్నాడో ఏంటో గానీ లేటెస్ట్ గా కేజ్రీవాల్ మరో ట్రిక్ ప్రదర్శించాడు. పాపం కేజ్రీవాల్ ఏదో మీటింగ్‌కి ఎవరో వ్యక్తి వెనుక నుంచి ఆయన మెడమీద కొట్టాడట. అక్కడే వున్న కార్యకర్తలు ఆ వ్యక్తికి దేహశుద్ధి చేశారట.

 

ఈ పాయింట్‌ని కేజ్రీవాల్ అర్జెంటుగా ట్విట్టర్లో పెట్టేసి సానుభూతి పొందడానికి తెగ ప్రయత్నించేశాడు. దాంతోపాటు తన మెడమీద కొట్టిన వ్యక్తి మీద తనకెలాంటి కోపం లేదని అభినవ గాంధీ గారిలా స్టేట్‌మెంట్ కూడా ఇచ్చాడు. అయ్యా కేజ్రీవాల్ నువ్వెన్ని చీప్ ట్రిక్స్ ప్రదర్శించినా జనం నిన్ను నమ్మరు.