జీఎస్టీ బిల్లు... 4 భాగాలుగా పన్ను రేట్లు..


కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ బిల్లును అమలులోకి వచ్చే ఏడాది నుండి తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగిన జీఎస్టీ మండలి సమావేశం ఏర్పాటు చేశారు కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..షెడ్యూల్ ప్రకారమే జీఎస్టీ (గుడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్) అమలులోకి వస్తుందని ..ఇవాళ జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో పన్ను రేట్ల విధానం, పరిహారంపై సుదీర్ఘంగా చర్చించినట్లు.. జీఎస్టీ పన్ను రేటును 5,12, 18, 28 శాతాలుగా (4 భాగాలుగా)నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆహారధాన్యాలపై సాధారణ ప్రజలకు పన్ను మినహాయింపు ఇవ్వనున్నట్లు తెలిపారు. సామాన్యులు వినియోగించే వస్తువులపై 5శాతం పన్ను రేటును నిర్ణయించినట్లు పేర్కొన్నారు. కూల్‌డ్రింక్స్, పాన్ మసాలా, లగ్జరీ కార్లు, పొగాకు ఉత్పత్తులపై 28శాతానికిపైగా పన్ను విధించనున్నట్లు తెలిపారు.