షిండే, చిదంబరం, ఆజాద్‌లకు అరెస్టు వారెంట్లు...

 

ముగ్గురు మాజీ కేంద్ర మంత్రుల అరెస్ట్‌కు అనంతపురం కోర్టు వారెంట్లు జారీ చేసింది. రాష్ట్ర విభజన అంశానికి సంబంధించిన కేసులో గత యూపీఏ ప్రభుత్వంలోని జీవోఎం సభ్యులైన సుశీల్ కుమార్ షిండే, గులాం నబీ ఆజాద్, పి. చిదంబరంలపై బెయిల్‌బుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. రాష్ట్ర విభజన సమయంలో యుపిఎ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఓఎం (గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్)లో ఈ ముగ్గురు మంత్రులే కీలకంగా నిలిచారు. అయితే విభజనకు సంబంధించిన విధి విధానాలను ఖరారు చేయడంలో వీరు ఏకపక్షంగా వ్యవహరించారని, కాంగ్రెస్‌ పార్టీ చెప్పినట్టల్లా ఆడారని, ఎవరి నుంచి ఎలాంటి సూచనలు స్వీకరించలేదన్న ఆరోపణలు వీరిమీద వున్నాయి.