'టైమ్స్‌ నౌ' కి ఆర్నబ్‌ గోస్వామి వీడ్కోలు..

 


సీనియర్‌ జర్నలిస్ట్ ఆర్నబ్‌ గోస్వామి ప్రముఖ ఆంగ్ల న్యూస్‌ చానల్‌ 'టైమ్స్‌ నౌ' లో చీఫ్ ఎడిటర్ పదవిలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన తన పదవినుండి తప్పుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తుంది. ఈ వీడియోలో ఆర్నబ్ గోస్వామి మాట్లాడుతూ.. 'ఆట ఇప్పుడే మొదలైదంటూ' తన సహచరులను ఉద్దేశించి ఆర్నబ్ భావోద్వేగ ప్రసంగం చేశారు. 'ఇండిపెండెంట్ మీడియా గురించి మనకు ఎవరూ బోధించరు. మనతంట మనమే నేర్చుకోవాలి. నేను ఇంత స్వేచ్ఛగా పనిచేయగలిగానంటే అందుకు మీరే కారణం. విధి నిర్వహణలో భాగంగా నేను కొంతమందిపై నోరు పారేసుకున్నాను. వారికి క్షమాపణ చెబుతున్నాను. మన చానల్ ను టాప్ లో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఇలా వ్యవహరించాన'ని వివరణయిచ్చారు. ప్రైమ్‌టైమ్‌ షో ‘ద న్యూస్‌ అవర్‌'తో పాపులరయిన ఆర్నబ్‌ గోస్వామి పదేళ్ల పాటు 'టైమ్స్‌ నౌ'లో పనిచేశారు. కాగా ఆయన సొంతంగా వార్తా చానల్ పెడతారని ప్రచారం జరుగుతోంది.