నేను చనిపోతే సెలవు ఇవ్వద్దు.. కలాం

 

తాను మృతి చెందినప్పుడు పాఠశాలలకు సెలవు ఇవ్వద్దని.. ఆరోజు ఒక గంట ఎక్కువ పనిచేయాలని కలాం చెప్పారని ఏపీ సీఎం చంద్రబాబు గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్రంలో ఈరోజు ఇవాళ గంటపాటు పాఠశాలలు అదనంగా పని చేయనున్నాయి. ఈ మేరకు అబ్దుల్ కలాం మృతి నేపథ్యంలో ఒక గంట ఎక్కవ సేపు పాఠశాలలు పని చేయాలని.. ఆగంటలో అబ్దుల్ కలాం జీవిత చరిత్ర పైన విద్యార్థులకు బోధన చేయాలని విద్యాశాఖ కమిషనర్ సంధ్యారాణి ఆదేశాలు జారీ చేశారు. ఒక్క పాఠశాలలే కాదు ప్రభుత్వ కార్యాలయాలు కూడా గంటపాటు అదనంగా పనిచేయాలని సూచించారు. మరోవైపు అబ్దుల్ కలాం మృతికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా కలాం దేసానికి విశిష్ట సేవలు అందించారని.. ఆత్మీయ వ్యక్తిని కోల్పోవడం బాధాకరంగా ఉందని కలాంతో తన అనుబంధాన్ని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.