ఏపీ ప్రత్యేక హోదాపై అయోమయం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో ఒకో నేత ఒకోలా మాట్లాడుతున్నారు. ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం కష్టమని 14వ పైనాన్స్ కమిషన్ సిఫార్సుల మేర ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదని కేంద్ర మంతి అరుణ్ జైట్లీ చెప్పగా ఏపీకీ ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశాలేవీ లేవని ఒక్క ఆర్ధిక లోటు కారణంగా ఏపీకీ ప్రత్యేక హోదా కోరుతున్నమని వెంకయ్యనాయుడు అన్నారు. ఇదిలా ఉండగా భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మోదీ ఏడాది పాలనపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా గురించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడానని, త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు ఏపీకీ ప్రత్యేక హోదా రాదని ఓవైపు చెపుతూ ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పడం.. మరోవైపు అమిత్ షా ప్రత్యేక హోదా గురించి వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చెప్పడం జీజేపీ నేతల పరస్పర విరుద్ధ ప్రకటనలతో అయోమయ పరిస్థితి నెలకొంది.