సీమాంధ్రలో 1గంట వరకు పోలింగ్ శాతం వివరాలు
posted on May 7, 2014 2:19PM
ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ కొనసాగుతోంది. సీమాంధ్ర వ్యాప్తంగా బుధవారం మధ్యాహ్నం 1-30 గంటలకు 58 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్ తెలిపారు. అనంతపురం జిల్లాలో అత్యధికంగా 60 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన చెప్పారు. సీమాంధ్రలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతోందని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలపై తమకు రిపోర్ట్ రాలేదని భన్వర్లాల్ తెలిపారు. రొంపిచర్లలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొనడంతో పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. దీంతో అక్కడ పరస్థితి అదుపులోకి వచ్చినట్లు చెప్పారు.
జిల్లాల వారీగా పోలింగ్ శాతం వివరాలు :
1. శ్రీకాకుళం : 57 శాతం
2. విజయనగరం : 54 శాతం
3. విశాఖపట్నం : 56 శాతం
4.తూగో : 59 శాతం
5. పగో : 56 శాతం
6. కృష్ణా : 58 శాతం
7. గుంటూరు : 56 శాతం
8.ప్రకాశం : 59 శాతం
9. నెల్లూరు : 57 శాతం
10. కడప : 59 శాతం
11. కర్నూలు : 58 శాతం
12. అనంతపురం : 60 శాతం
13. చిత్తూరు : 56 శాతం