తొమ్మిది లోపు కౌంటింగ్!

 

 

 

మున్సిపల్ఎన్నికల కౌంటింగ్ విషయంలో హైకోర్టు తీర్పు ప్రకటించింది. ఈనెల 9వ తేదీ లోపు కౌంటింగ్ పూర్తి చేయాలని హైకోర్టు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఎన్నికల కమిషన్ షెడ్యూలు ప్రకారం రేపటి నుంచి కౌంటింగ్ జరపాల్సి వుంది. అయితే ఇప్పుడే మున్సిపల్ ఫలితాలు ప్రకటిస్తే ఆ ఫలితాలు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల పోలింగ్‌ మీద ప్రభావం చూపే అవకాశం వుందని, అందువల్ల ఫలితాలను వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ విషయంలో కోర్టు తీర్పు కోసం రాజకీయ పక్షాలు ఆసక్తిగా ఎదురుచూశాయి. ఫలితాలు ముందుగా విడుదల చేస్తే ఓటర్లు ప్రభావితులవుతారని దాఖలైన పిటిషన్లను హై కోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల ఫలితాలను ఈనెల 9 లోపు విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ కౌంటింగ్‌కి సన్నాహాలు ప్రారంభించింది.