ఇంటర్ ఫలితాలలో అమ్మాయిలదే పైచేయి

 

 

 

ఎప్పటి లాగానే ఈసారి కూడా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ లో అమ్మాయిలే పైచేయి సాధించారు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వీళ్ళలో బాలుర శాతం 51.37. బాలికల ఉత్తీర్ణత శాతం 60.52. బాలుర కంటే బాలికలే దాదాపు తొమ్మది శాతం అదనంగా ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాసిన విద్యార్థుల సంఖ్య 8.68 లక్షల మంది. వీరిలో ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య 4.55 లక్షలు. మొత్తం పరీక్షలు రాసిన విద్యార్థులలో 55.84 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్స్ లో 42.98 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం 1.24 శాతం పెరిగింది.