ఏపీ ఐఏఎస్ అధికారుల మూడు రోజుల వేతనం సి.ఎం.ఆర్.ఎఫ్ కు 

ఆంధ్ర ప్రదేశ్ ఐఏఎస్ ఆఫీసర్లు తమ ఉదారత చాటుకున్నారు. కరోనా బారిన పడిన రాష్ట్రాన్ని ఆదుకోవటానికి తమ మూడు రోజుల వేతనాన్ని ముఖ్య మంత్రి సహాయ నిధికి ( సి.ఎం. ఆర్. ఎఫ్.) విరాళంగా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ఐ ఏ ఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తమ నిర్ణయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియచేశారు. అలాగే, తమ మార్చ్ నెల జీతాల నుంచి మూడు రోజుల వేతనాన్ని మినహాయించి, ఆ మొత్తాన్ని సి ఎం ఆర్ ఎఫ్ కు జమ చేయాల్సిందిగా కోరుతూ, రాష్ట్ర ఆర్ధిక శాఖ కు సమాచారం కూడా పంపినట్టు ఆయన చెప్పారు.