మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్..
posted on Feb 26, 2021 2:45PM
ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎస్ఈసీ నోటిఫికేషన్ ప్రకారమే మున్సిపల్ ఎన్నికలు జరపవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ ఇచ్చి 11 నెలలు గడిచిందని. కొత్త నోటిఫికేషన్ను ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో 16 పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని దాఖలైన పిటిషన్ను కొట్టివేసింది. పిటిషనర్ల వాదనలతో ఏకీభవించని న్యాయస్థానం.. పాత నోటిఫికేషన్ ప్రకారమే ఎన్నికలు నిర్వహించుకోవచ్చని ఆదేశించింది. మున్సిపల్ ఎన్నికలు యథావిధిగా మార్చి 10న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు చేపట్టవచ్చని న్యాయస్థానం స్పష్టం చేసింది.