మార్చి నెల వేతనంలో 50% వాయిదా...
posted on Apr 1, 2020 10:34AM
మార్చి నెల వేతనంలో 50% వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. GO Ms. No. 26 dated 31-03-2020 ను ఆర్థిక శాఖ విడుదల చేసింది. గ్రాస్ శాలరీలో.. 50% వాయిదా వేస్తున్నట్లు జి.వో. విడుదల చేశారు.
ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సహా అన్ని రకాల రాజీకీయ ప్రతినిధులకు 100%, అఖిల భారత సర్వీస్ ఉద్యోగులకు 60%(IAS,IPS,IFS..etc),
ఇతర అన్ని క్యాడర్ల ఉద్యోగస్తులకు 50% వాయిదా (నాల్గో తరగతి ఉద్యోగులు కాకుండా), నాల్గో తరగతి ఉద్యోగులకు 10%.
ఏ విభాగంలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులకు పై దమాషాలో పెన్షన్ వాయిదా.
ఆల్రెడీ సబ్మిట్ చేసిన జీతాల బిల్లుల ను CFMS ద్వారా కేంద్రీకృతం చేసి 50% గ్రాస్ శాలరీ వాయిదా వేస్తారు. ఇంకా సబ్మిట్ చేయని బిల్లుల విషయంలో పై ఉత్తర్వులు ప్రకారం చేయాలని సూచిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వాయిదా వేసిన 50% జీతాన్ని ఎప్పుడు చెల్లించేది ఉత్తర్వులలో స్పష్టం చేయలేదు. తదుపరి ఉత్తర్వులు విడుదల అయ్యే వరకు ఈ GO కొనసాగుతుందని పేర్కొన్నారు.
కరోనా ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడిందని.. అందుకే ఈ నెలలో సగం వేతనం చెల్లిస్తామని, నిధులు సమకూరిన తరువాత మిగతా సగం చెల్లిస్తామని సీఎం చెప్పారని ఏపీ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ తెలిపారు. ఈ ఆపత్కాల పరిస్థితిలో రెండు విడతలుగా జీతం తీసుకునేందుకు ఒప్పుకున్నామని సూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ ఒక్క నెల మాత్రమే రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం చెప్పారన్నారు.