జగన్ ఇంటి పై తీవ్ర చర్చ...

 

సీఎం నివాసాల ఆధునికీకరణకు సంబంధించి జారీ చేసిన మరి కొన్ని జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికే 3 కోట్ల రూపాయల విలువ చేసే పనులు రద్దు చేయగా తాజా రద్దుతో ఆ మొత్తం 7 కోట్లకు చేరింది.మూడు రోజులుగా 7 కోట్ల రూపాయల పన్నును రద్దు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమవుతోంది. ఇలా వరుస పెట్టి తన ఇంటి కోసం జారీ చేసిన జీవోలను సీఎం జగన్ రద్దు చేసుకుంటూ వెళ్లడం ఎంత వరకూ కరెక్ట్ అనే చర్చ మొదలైంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి కోసం ఆ మాత్రం ఖర్చులు పెట్టక తప్పదు అంటున్నాయి అధికార వర్గాలు. విమర్శలకూ వెరసి ఈ విధంగా రద్దు చేసుకోవడం సరి కాదని మరికొందరి వాదన. ప్రభుత్వ నిర్ణయం ప్రతిపక్షాలకు మరింత బలమిచ్చినట్టు అవుతుందని చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాలు ఎంతగా గగ్గోలు పెట్టినా పట్టించుకోకుండా తన పని చేసుకుని వెళ్తాడనే పేరు తెచ్చుకున్న సీఎం జగన్ ఈ స్థాయిలో రియాక్టయితే వీక్ అవుతారనే ఆందోళన కనిపిస్తోంది అసెంబ్లీ సమావేశాల ముందు జీవోల రద్దు వ్యవహారం తెరమీదకు రావడాన్ని పార్టీ వర్గాలు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నట్టు సమాచారం. అయితే ముఖ్యమంత్రి జగన్ మాత్రం ఈ విషయంలో ససేమిరా అన్నట్టు తెలిసింది. ప్రతిపక్షం ఈ వ్యవహారాన్ని లేవనెత్తితే ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలోననే అంశం తనకు తెలుసు అన్నట్టుగా ఉన్నారని సమాచారం. మొత్తానికి తన ఇంటి పనుల విషయంలో జగన్ తీసుకున్న నిర్ణయం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.