ఏపీ ఉభయసభలు ప్రారంభం... వాయిదా

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు శనివారం నుండి ప్రారంభమయ్యాయి. ఈ సభల సమావేశాల ప్రారంభం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ ప్రసంగించారు. ఈ సభలో ఆయన ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్నసమస్యల గురించి ప్రస్తావించారు. పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి సాధించాలంటే కేంద్ర ప్రభుత్వం సాయం తప్పనిసరి అని అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ది కోసం కేంద్రం నుండి ప్రత్యేక ప్యాకేజీ కోసం ఎదురుచూస్తున్నామనీ, రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు ధన్యవాదాలని అన్నారు. గవర్నర్ ప్రసంగించిన అనంతరం శాసనసభ సోమవారానికి వాయిదా పడింది.