పచ్చ మీడియా కుట్ర అంటూ మండిపడ్డ అంజాద్ బాషా 

* తప్పుడు వార్త రాసినందుకు క్రిమనల్ కేసు పెడతానంటూ వార్నింగ్ 
* డెప్యూటీ సి ఎం గా నాపరాతి అడుగు ఢిల్లీ లో నమోదైంది, చెక్ చేసుకోండి: అంజాద్ బాషా 

తన పైన, ఈ ప్రభుత్వంపై పచ్చ మీడియా పెద్ద కుట్రకు తెరలేపిందని డెప్యూటీ సీఎం అంజాద్ బాషా ఆరోపించారు. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాల్సిన కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకు తెరలేపుతున్నాయన్నారు. " నేను ఈ నెల 2వ తేదీన ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్ళాను. కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంను..నాకు ప్రోటోకాల్ ఉంటుంది.అందులో నా ప్రతి ఒక్క అడుగు నమోదు అవుతుంది.ఆ రోజు నేను ఏపీ భవన్ లొనే బస చేసాను.మరుసటి రోజు సీఎం గారిని కలిశాను...4వ తేదీ కాబినెట్ లోనూ ఉన్నాను.ఆ తర్వాత కడప చేరుకుని ఎన్నికల పనుల్లో పడ్డాం," అంటూ చెప్పుకొచ్చిన అంజాద్ బాషా నిజాలు తెలుసుకోకుండా ఇష్టారీతిన రాయడమే జర్నలిజమా అని ప్రశ్నించారు. "కనీసం నా వివరణ కూడా అడగలేదు.ఇదంతా ఈ కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, నన్ను ఇబ్బంది పెట్టాలని పచ్చ మీడియా పన్నిన కుట్ర. అందుకే నేను చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతాను...పరువు నష్టం దావా వేస్తాను.. ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలి...పచ్చ మీడియా రాసిన పిచ్చి రాతలను నమ్మొద్దు," అని విజ్ఞప్తి చేశారు.