అతికష్టం మీద వీగిపోయిన అవిశ్వాసం

 

టి.ఆర్.ఎస్., వైఎస్సార్సీపీ విడివిడిగా స్పీకర్ కు సమర్పించిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం అసెంబ్లీలో ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానానికి టి.డి.పి. తటస్థంగా ఉండడంతో కాంగ్రెస్ ప్రభుత్వం అతి కష్టంగా 142-58 తేడాతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా కాంగ్రెస్ రెబల్స్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, ఆళ్ళ వంశీకృష్ణ శ్రీనివాస్, పేర్ని నాని, సుజయ్ కృష్ణ రంగారావు, ముద్దాల రాజేష్ కుమార్, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, జోగి రమేష్, గొట్టిపాటి రవి, టి.డి.పి. రెబల్స్  కొడాలి నాని, వై.బాలనాగిరెడ్డి, ఎం. అమరనాథ్ రెడ్డి, పిరియా సాయిరాజ్, ఎ.వి. ప్రవీణ్ కుమార్ రెడ్డి ఓటు వేశారు. అసెంబ్లీలో మొత్తం 295మంది సభ్యులు కాగా 264 మాత్రమే హాజరయ్యారు. మొదటినుండి చెపుతున్నట్టుగానే ఎం.ఐ.ఎం. అవిశ్వాస తీర్మానానికి దూరంగా వుంది. లోక్ సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ, ఇండిపెండెంట్ సభ్యుడు నాగం జనార్థన రెడ్డి, టిడిపికి చెందిన చిన్నం రాంకోటయ్య, వేణుగోపాలచారి, హరీశ్వర్ రెడ్డి అవిశ్వాస తీర్మానం ఓటింగ్ లో పాల్గొనలేదు.