రాజధానిపై చంద్రబాబు 20 పేజీల ప్రకటన...

 

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని, ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధికి సంబంధించిన 20 పేజీల ప్రకటనను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం శాసనసభలో విడుదల చేశారు. ఈ ప్రకటనలో రాష్ట్రంలోని 13 జిల్లాల్లో అభివృద్ధి ఏ రకంగా చేయబోతున్నారన్నది స్పష్టంగా వివరించారు. భూ సేకరణ ద్వారా రాజధానిని నిర్మించాలని భావిస్తున్నామని, శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ప్రజాభిప్రాయాన్ని బలపరిచిందని అన్నారు. రాష్ట్ర ప్రగతి సాధన, ప్రజల సంక్షేమం కోసమే విజయవాడ రాజధానిగా నిర్ణయం తీసుకున్నామని చంద్రబాబు తెలిపారు. ప్రతి జిల్లాలో ఒక ఫుడ్ పార్క్ ఏర్పాటు చేస్తామని, భూ సేకరణ విధి విధానాలపై మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేయనున్నామని, రాష్ట్రంలో మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు నిర్మించనున్నామని, రాబోయే రోజుల్లో ఒక్కో సంవత్సరంలో ఒక్కో జిల్లాలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తామని సీఎం ఆ ప్రకటనలో పేర్కొన్నారు.