ఈ సమయంలో జగన్ దీక్ష.. జైలు ఖాయం..

 

ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒకపక్క ఈ నెల 22వ తేదీన జరగబోయే శంకుస్థాపన కార్యక్రమానికి ఏపీ ప్రభుత్వం పనులు చేపడుతుంటే మరోపక్క ప్రతిపక్షనేత జగన్ ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ గుంటూరులో నిరవధిక దీక్ష చేస్తున్నారు. ఈ సమయంలో జగన్ చేస్తున్న దీక్షపై ఏపీ మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన శుభకార్యం జరుగుతున్న సమయంలో జగన్ ఇలాంటి దీక్షలు చేయడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. శుభకార్య సమయంలో జగన్ చేసే ఈ చర్యలకు ఆయన తప్పకుండా మూడు నెలల్లో జైలుకు వెళ్లడం ఖాయమని అంటున్నారు. జగన్ అందరికీ భిన్న వైఖరితో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.