లైంగిక వేధింపుల నిరోధక బిల్లుకు క్యాబినెట్ ఆమోదం

కేంద్ర క్యాబినెట్ గురువారం అత్యాచారం, మహిళల పట్ల అసభ్యకర ప్రవర్తన, యాసిడ్ దాడులు వాటిని మహిళలపై లైంగిక నేరాలుగా బిల్లులో పేర్కొంటూ లైంగిక వేధింపుల నిరోధక సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. లైంగిక దాడులకు పాల్పడి మహిళలలను హత్యచేసిన కేసుల్లో సంబంధిత నిందుతులకు మరణశిక్ష విధించే అధికారం, లైంగిక నేరాలకు పాల్పడే వారికి కనీసం ఇరవై సంవత్సరాలనుంచి జీవించి ఉన్నంత కాలం జైలుశిక్ష పడేలా ఈ బిల్లులో పొందుపరిచారు. మహిళలలను ఉద్దేశపూర్వకంగా తాకటం, వేధించటం వంటి చర్యలకు బెయిల్ కూడా ఇవ్వ వీలులేని నేరంగా పరిగణిస్తారు. కేంద్రమంత్రులు రెండు గ్రూపులుగా ఏర్పడి బుధవారం లైంగిక వేధింపుల నిరోధక బిల్లుపై కూలంకుషంగా చర్చించింది. మంత్రుల బృదం బిల్లు డ్రాఫ్ట్ ను ఫిబ్రవరి 3న జారీ చేసిన ఆర్డినెన్స్ స్థానంలో ఆమోదం తెలిపింది.దేశంలో మహిళలపై జరుగుతున్నా లైంగిక దాడులను నివారించేందుకు చట్టాలలో తీసుకురావలసిన మార్పులపై జస్టీస్ వర్మ కమీషన్ ను ప్రభుత్వం నియమించింది. ఈ కమీషన్ సూచనల మేరకు ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. అలాగే పరస్పర లైంగిక అనుమతి చట్టబద్ధతకు ఇప్పటివరకూ ఉన్న 18 సంవత్సరాల వయస్సును 16 సంవత్సరాలకు తగ్గించే ప్రతిపాదనకు క్యాబినెట్ సుముఖత వ్యక్తం చేసింది.