జంటనగరాలకు మరో పేలుడు ముప్పు

దిల్ షుక్ నగర్ ప్రేల్లుళ్ళు మరవక ముందే బుధవారం ఉదయం కేంద్ర నిఘావర్గాల నుంచి మరోసారి హెచ్చరికలు జారీ అయినట్లు తెలుస్తుంది. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికలతో జంటనగరాల పోలీస్ వ్యవస్థ అప్రమత్తతై నగర ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. అనుమానాస్పద వ్యక్తుల కదలికలు గుర్తిన్చ్నినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను పోలీసులు కోరుతున్నారు. ఇంటర్మీడియ పరీక్షలు జరుగుతున్నా సమయంలోనే కేంద్ర నిఘావర్గాల నుండి హెచ్చరికలు రావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు వర్గాలు నగరంలో హై అలర్ట్ ప్రకటించి తనీఖీలు ముమ్మరం చేశారు. అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.