హజారే 1100 కి.మీ. పాదయాత్ర

సామాజిక ఉద్యమకర్త అన్నా హజారే సమరశంఖం పూరించారు. కేంద్రం ప్రతిపాదించిన భూసేకరణ చట్ట సవరణ బిల్లులోని రైతు వ్యతిరేక నిబంధనలను ఉపసంహరించుకోవాలన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు మహారాష్ట్రలోని వార్దా నుండి ఢిల్లీకి 1100 కి.మీ. వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఈ పాదయాత్ర వార్దాలోని గాంధీ ఆశ్రమం నుండి మొదలయ్యి ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో ముగుస్తుందన్నారు. ఈ పాదయాత్రకు సుమారు 3 నెలల సమయం పడుతుందనీ, ఈ నెల 9న జరిగే సేవాగ్రామ్ సమావేశంలో యాత్రకు సంబంధించిన విధి విధానాలను తెలియజేస్తామని చెప్పారు.