2017 జూన్ లోపు వస్తేనే ఆంధ్రా ప్రజలు

స్థానికతపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది, తెలంగాణలో ఉంటున్న ఉద్యోగులు గానీ, ప్రజలు గానీ, విద్యార్ధులు గానీ 2017 జూన్ లోపు ఏపీకి వస్తే వారిని స్థానికులుగానే గుర్తించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది, స్థానికత వివాదం, ఏపీ ఉద్యోగులు నవ్యాంధ్ర రాజధానికి రావడానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు, రాష్ట్ర విభజన కారణంగా ఏర్పడిన స్థానికత సమస్యకు పరిష్కారం ఇవ్వాలని భావించిన ముఖ్యమంత్రి చంద్రబాబు....మంత్రివర్గంతో చర్చించి ఈ విధానపరమైన నిర్ణయం ప్రకటించారు