ఆంధ్రజ్యోతి టిడిపి మానసపుత్రిక

 

 

andhrajyoti tdp, tdp andhrajyoti, chandrababu kcr

 

 

ఆంధ్రజ్యోతి తెలుగుదేశం మానసపుత్రిక అని, చంద్రబాబు కు ఆంధ్రజ్యోతి ఎంపీ వేమూరి రాధాకృష్ణ బినామీ అని, ఆయన అధికారంలోకి రావాలని రాధాకృష్ణ టీఆర్ఎస్ మీద బురద జల్లుతున్నారని, కనీసం కేటీఆర్ వివరణ తీసుకోకుండా, ఎలాంటి ఆధారాలు లేకుండా కథనం ప్రసారం చేయడం జర్నలిజం విలువలకు వ్యతిరేకం అని టీఆర్ఎస్ ఎల్పీ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. ఆంధ్రజ్యోతి కథనం మీద ప్రభుత్వం స్పందించాలని, రాధకృష్ణపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన మీద ప్రసారం చేసిన కథనాలకు ఆధారాలు చూపాలని, లేదా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ఈ పరిస్థితులలో టీడీపీ ధర్నా చేయడం విశేషం.