ఏపీలో 3 మెగాసిటీలు.. 14 స్మార్ట్ సిటీలు...

 

బాబు ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడ పరిసరాల్లోనే వుంటుందని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు ఆయన గురువారం నాడు అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ అందుబాటులో వుండే విజయవాడ పరిసరాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని వుంటుంది. ల్యాండ్ పూలింగ్ పద్ధతి ద్వారా రాజధానికి అవసరమైన భూ సేకరణ చేస్తాం. అన్ని జిల్లాల్లో అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి వుంది. అందుకు అవసరమైన ప్రణాళికను కూడా సిద్ధం చేశాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతటా మూడు మెగాసిటీలు, 14 స్మార్ట్ సిటీలు నిర్మించనున్నాం’’ అన్నారు.