విద్యుత్‌ విషయంలో గవర్నర్ ఉపదేశం

 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఏర్పడిన విద్యుత్ వివాదాలను రెండు రాష్ట్రాలూ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఉపదేశం చేశారు. శ్రీశైలంలో నీటిని విద్యుత్ ఉత్పత్తికి విడుదల చేయడంపై తెలంగాణ ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం అభ్యంతరం చెబుతోంది. ఈ నేపథ్యంలో ఈ వివాదాన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని చర్చించుకోవాలని నరసింహన్ చెప్పారు. దీపావళి సందర్భంగా నరసింహన్ ప్రజా దర్బార్ నిర్వహించిన సందర్భంగా గవర్నర్ ఈ వ్యాఖ్యలు చేశారు. రెండు రాష్ట్రాల వివాదాల విషయంలో గవర్నర్ చాలా కూల్‌గా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.