ఏపీకి లోకాయుక్త నోటీసులు ఎందుకని?

 

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లోకాయుక్త బుధవారం నాడు నోటీసులు జారీ చేసింది. తెలంగాణతో కుదరాల్సిన విద్యుత్ ఒప్పందాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇలా ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో వివరించాలని లోకాయుక్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిపిఎ ఒప్పందాల రద్దు ఎందుకు చేయాల్సి వచ్చిందో జనవరి 19వ తేదీలోగా వివరణ ఇవ్వాలని లోకాయుక్త ఆదేశించింది. అయితే పిపిఎల రద్దు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గట్టి పట్టుదల మీద వుంది. పిపిఎల రద్దు విషయంలో తనకు పూర్తి హక్కులు వున్నాయన్న వాదనను లోకాయుక్త ముందు వినిపించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. విద్యుత్ విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య వివాదాలు నెలకొన్న నేపథ్యంలో పునర్విభజన చట్టాన్ని ఉల్లంఘించి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకుంటోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది.