ఆంధ్రా అమ్మాయి... సింధు అదరగొట్టింది...

 

అచ్చ తెలుగు ఆంధ్రా అమ్మాయి పి.వి.సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్లో విజయం సాధించింది. ఆట ఆరంభం నుంచే చెలరేగి ఆడిన సింధు.. మొదటి గేమ్‌ కోల్పోయినా ఆ తర్వాత పుంజుకుంది. వరుసగా రెండు గేమ్స్‌లు గెలిచి మ్యాచ్‌ను ముగించింది. గత ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన పివి సింధు, వరల్డ్‌ ఛాంపియన్‌షిప్‌లో రెండు మెడల్స్‌ సాధించిన క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది.ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌‌షిప్‌లో సైనా నెహ్వాల్‌ పోరు ముగిసింది. మరోసారి పతకం గెలవకుండానే సైనా స్వస్థలానికి వెనుదిరిగింది.