తుఫానుపై సీఎం చంద్రబాబు సమీక్ష

 

హుదూద్ తుఫాను పరిస్థితిని సమీక్షించేందుకు సచివాలయంలో మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేశారు. ఆదివారం ఉదయం సచివాలయానికి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లోని 44 మండలాలలో 320 గ్రామాలు తుఫాను ప్రభావానికి గురయ్యే ప్రమాదం వుందని అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళారు. తుఫాను తీరాన్ని దాటిన అనంతరం చంద్రబాబు పరిస్థితిని మరోసారి సమీక్షించారు. ప్రజలను సాయంత్రం వరకు ఇళ్ళ నుంచి బయటకి రావొద్దని సూచించారు. ఆదివారం సాయంత్రం తాను విశాఖపట్నం వెళ్తానని, అవసరమైతే రెండు మూడు రోజులు అక్కడే వుంటానని చంద్రబాబు తెలిపారు.