తుఫాను ప్రభావం: చంద్రబాబు ఏరియల్ సర్వే

 

హుదూద్ తుఫాను ప్రభావానికి లోనైన ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. సోమవారం తెల్లవారు జామున చంద్రబాబు ఏరియల్ సర్వేకి వెళ్ళారు. ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం లతో పాటు తూర్పు గోదావరి జిల్లాలోని పరిస్థితులను కూడా ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఏరియల్ సర్వే తర్వాత చంద్రబాబు విశాఖపట్నం చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రులందరిని విశాఖ చేరుకోవాలని ఇప్పటికే చంద్రబాబు ఆదేశించారు.వారికి తుపాను సహాయ చర్యలపై కార్యాచరణ అప్పగించి, రంగంలోకి దించారు. ముప్పై మంది ఐఎఎస్‌లను సహాయ, పునరావాస చర్యల పర్యవేక్షణ నిమిత్తం కేటాయించారు. మండలానికో ఐఏఎస్‌కి బాధ్యతలు అప్పగించారు. సహాయక చర్యలు పూర్తి అయ్యే వరకు చంద్రబాబు నాయుడు విశాఖలోనే వుంటారు.