కరోనానూ రాజకీయాలకు వాడుకోవడం నీచం: అంబటి రాంబాబు

* వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, అధికార ప్రతినిధి అంబటి రాంబాబు కామెంట్స్..  

గుంటూరు ఎమ్మెల్యే ముస్తఫా ఇచ్చిన విందుకు నేను, ఆర్కే, శ్రీ దేవి వెళ్ళాము అని అసత్య ప్రచారం చేస్తున్నారు.అసలు విందే జరగలేదు... జరగని విందుకు మేము ఎలా వెళతామనీ అంబటి రాంబాబు ప్రశ్నించారు.మా పై రాజకీయ ప్రత్యర్థులు  దుష్ప్రచారం  చేస్తున్నారు.మేము అంతా క్వారంటైన్ కి వెళ్ళాలి అని ట్రోల్ చేస్తున్నారు.

కరోనా ప్రపంచాన్ని వణికిస్తోన్న ఇలాంటి క్లిష్ట సమయంలో మా పై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేయడం సరికాదన్నారు అంబటి రాంబాబు. రాజకీయ ప్రత్యర్థులుగా రాజకీయాలు ఉంటే.. తరువాత మాట్లాడదాం. రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదు.నిజంగా క్వారంటైన్ కి వెళ్లాల్సిన పరిస్థితే వస్తే సామాజిక బాధ్యతగా మేమంతా వెళతా మన్నా రు ఆయన.