ఉత్తరప్రదేశ్ నుంచే జయప్రద పోటీ

 

 

 

ప్రముఖ సినీ నటి, లోక్ సభ సభ్యురాలు జయప్రద మళ్ళీ ఉత్తరప్రదేశ్ నుంచే పోటీ చేయనున్నారు. అయితే ఈ సారి రాష్ట్రం నుంచి పోటీ చేయాలని జయప్రద భావించిన, రాష్ట్ర రాజకీయ పార్టీలతో ఆమె చేసిన చర్చలు పలించకపోవడంతో తిరిగి ఉత్తరప్రదేశ్ నుంచే పోటీ చేయబోతున్నారు. సమాజ్ వాదీ పార్టీ నేత అమర్ సింగ్ ఆ పార్టీని వీడడంతో జయప్రద కూడా ఆయనను అనుసరించింది. ఇద్దరూ రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలో చేరుతున్నారు. అమర్ సింగ్ ఫతేపూర్ నుంచి, జయప్రద బిజినేపూర్ నుంచి లోక్ సభకు పోటీచేయనున్నారు.