ఆళ్ళగడ్డ నోటిఫికేషన్ విడుదల

 

రోడ్డు ప్రమాదంలో భూమా శోభా నాగిరెడ్డి మరణం కారణంగా ఖాళీ అయిన ఆళ్ళగడ్డ శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నోటిఫికేషన్‌ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఎన్నికల షెడ్యూలు : నామినేషన్ల దాఖలు - ఈ నెల 14 నుంచి 21వ తేదీ వరకు, నామినేషన్ల పరిశీలన - ఈనెల 22న, నామినేషన్ల ఉపసంహరణ గడువు - ఈనెల 24న, పోలింగ్ - నవంబర్ 8న, ఓట్ల లెక్కింపు - నవంబర్ 12న. ఈ ఉప ఎన్నికలో భూమా శోభా నాగిరెడ్డి పెద్ద కుమార్తె అఖిల ప్రియ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉన్నారు. ఈ ఉప ఎన్నికను ఏకగ్రీవం చేయడానికి వైసీపీపార్టీ నాయకులు ప్రయత్నిస్తున్నారు.