అఖిలేష్ ప్రచారం ప్రారంభం..ములాయం హాజరు..

 

వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలకు ఇతర పార్టీలు ఎప్పటినుండో ప్రచారం మొదలుపెట్టగా.. సమాజ్ వాదీ పార్టీ మాత్రం ఇప్పుడు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ 'వికాస్ రథ యాత్ర' పేరిట ప్రచారాన్ని ప్రారంభించారు. అయితే అఖిలేష్ ప్రచార కార్యక్రమానికి తన తండ్రి అయిన ములాయం సింగ్ యాదవ్ వస్తారా..రారా అని అందరూ ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయన ప్రచార కార్యక్రమానికి వచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. కాగా మరోవైపు ఇప్పటికే రథయాత్రకు ఎంతో ప్రచారాన్ని కల్పించగా, భారీ ఎత్తున యువకులు యాత్రలో పాల్గొంటారని తెలుస్తోంది. యాత్ర సాగే మార్గంలో అఖిలేష్ సాధ్యమైనన్ని ఎక్కవ చోట్ల మాట్లాడుతారని, యువతతో పాటు రైతులు, మైనారిటీలతో ఆయన మమేకమవుతారని తెలుస్తోంది.