రేపటి నుంచే విశాఖ విమానాలు...

 

హుదూద్ తుఫాను విధ్వంసం నుంచి కోలుకుంటున్న విశాఖకు శుక్రవారం నుంచి విమానాలను నడుపనున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు వెల్లడించారు. తుఫాను కారణంగా విశాఖ విమానాశ్రయం పూర్తిగా ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ అంశంమీద అశోక్ గజపతి రాజు గురువారం విశాఖ విమానాశ్రయం ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ‘‘విశాఖ విమానాశ్రయంలో ప్రస్తుత పరిస్థితి మెరుగుపడింది. శుక్రవారం నుంచి విమానాల రాకపోకలు యథావిధిగా జరుగుతాయి. అలాగే వచ్చేనెల ఒకటో తేది నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులనూ విశాఖ విమానాశ్రయానికి అందుబాటులోకి తెస్తున్నాం. హుదుద్ తుఫాను వల్ల తీవ్రంగా ధ్వంసమైన విమానాశ్రయాన్ని సిబ్బంది రేయింబవళ్లు శ్రమించి పునరుద్ధరించారు’’ అన్నారు.