అహ్మదుల్లా కాన్వాయ్పై చెప్పులతో దాడి
posted on Aug 5, 2013 8:53PM
ఉదృతంగా జరుగుతున్న సమైక్య ఉద్యమంతో సీమాంద్ర నాయకులు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రజాభీష్టం మేరకు ఇప్పటికే చాలా మంది ప్రజాప్రతినిధుల రాజీనామ చేశారు. అయితే ఇప్పుడు రాజీనామ చేయని నాయకులపై ఆప్రాంతంలో తీవ్ర వ్యతిరేఖత వ్యక్తం అవుతుంది. ముఖ్యంగా మంత్రులకు ఈ ఇబ్బంది ఎక్కువగా ఉంది. అందుకే చాలా మంది సీమాంద్ర మంత్రులు హైదరాబాద్ కే పరిమితం అవుతున్నారు.
సోమవారం తన నియోజికవర్గానికి వచ్చిన మంత్రి అహ్మదుల్లాకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కడప జిల్లాకు వ్యక్తిగతపని మీద వచ్చిన అహ్మదుల్లా కాన్వాయ్ పై సమైక్య వాదులు చెప్పులతో దాడిచేశారు. వెంటనే రాజీనామ చేయాలని నినాధాలు చేశారు. ఓ ఆందోళన కారుడు విసిరిన చెప్పుడు మంత్రి తగలటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
వెంటనే తేరుకున్న అహ్మదుల్లా ఆందోళన కారులను సముదాయించారు. తాను కూడా రాజీనామ చేయడానికి సిద్దంగా ఉన్నాని ప్రకటించి ఆందోళనకారులను శాంతింప చేసే ప్రయత్నం చేశారు.