ఎట్టకేలకు మోడీకి అద్వానీ మద్దతు

 

 

 

ఎట్టకేలకు బీజేపీ అగ్రనేత అద్వానీ తమ పార్టీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీకి తన మద్దతు ప్రకటించారు. మార్పు కావాలంటే మోడీకి ఓటు వేయాలని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. మోదీని పార్టీ ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినప్పుడు నుంచి ఆయనతో అద్వానీకి సుహృద్భావ సంబంధాలు లేవు. ఇటీవల అద్వానీ పోటీ చేసే స్థానం విషయంలో నెలకొన్న వివాదంతో ఆ దూరం మరింత పెరిగిందని అంతా భావించారు. అయితే సోమవారం మహారాష్ట్రలోని శెవగావ్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న అద్వానీ మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రస్తుతం దేశానికి కావల్సింది నినాదాల నాయకుడు కాదు.. దృఢమైన నిర్ణయాలు తీసుకుని అమలు చేసే నాయకుడు. అందుకే మార్పు కోసం మోదీకి ఓటేయండి అని పిలుపునిచ్చారు.