సన్యాసం పుచ్చుకున్న హీరోయిన్

 

కొంతమంది హీరోయిన్లు భలేవాళ్ళు... కెరీర్ బాగా నడిచినంతకాలం వెండి తెర మీద తమ అందాలను, లయలను, హొయలను, జిగిని, బిగిని ధారాళంగా ప్రదర్శిస్తారు. వీళ్ళను చూసి సన్యాసులకు కూడా సంసారం మీద ఆసక్తి పుట్టి కాషాయ వస్త్రాలకు గుడ్ బై చెప్పేస్తూ వుంటారు. ఈ హీరోయిన్లు మాత్రం కెరీర్ ముగిసిపోయిన తర్వాత సన్యాసాన్ని స్వీకరిస్తూ వుంటారు. అంతా మాయ... ఈ టాపిక్ ఎందుకంటే, లేటెస్ట్‌గా ఒక హీరోయిన్ సన్యాసం పుచ్చుకుంది. ఆమె మరెవరో కాదు... ఒకప్పుడు ఇండియాలో దుమ్ము దులిపిన నేపాల్ అమ్మాయి మనీషా కొయిరాలా. మొన్నామధ్య క్యాన్సర్ వ్యాధికి గురై, ఆ తర్వాత చికిత్సతో ఆ వ్యాధి బారి నుంచి బయటపడిన ఆమె ఇప్పుడు సన్యాసం పుచ్చుకుంది. సాధ్వి అవతారం ఎత్తింది. హరిద్వార్‌లో వున్న పిల్టో బాబా ఆశ్రమంలో మనిషా కొయిరాలా సన్యాసం తీసుకునే కార్యక్రమం రెండ్రోజుల క్రితం జరిగింది. సినిమాల్లో వేషాలు లేవు... విలాస జీవితమూ బోర్ కొట్టేసింది. క్యాన్సర్ కారణంగా చావు వరకూ వెళ్ళొచ్చింది.... ఆ క్యాన్సర్ ఎప్పుడు తిరగబెడుతుందో తెలియదు... దానికితోడు మేడమ్ గారి పెళ్ళి కూడా పెటాకులైపోయింది. ఇక సన్యాసమే బెటరని అనుకుని వుండొచ్చు..