చంద్రబాబుపై పోసాని సంచలన వ్యాఖ్యలు

 

ఏపీ సీఎం చంద్రబాబునాయుడిపై సినీ నటుడు పోసాని కృష్ణ మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలంగాణలో వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే పలు పార్టీల నేతలు తమ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.తాజాగా ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్‌ జూబ్లిహిల్స్ అభ్యర్థి మాగంటి గోపినాథ్.. ఎల్లారెడ్డి గూడలోని పోసాని నివాసానికి వచ్చారు. టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా పోసాని మాట్లాడుతూ అతి తక్కువ కాలంలోనే రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు.ప్రత్యేక రాష్ర్టం కలలు సాకారం కావాలంటే మళ్లీ కేసీఆర్ అధికారంలోకి రావాలని పోసాని ఆకాంక్షించారు.తాను టీఆర్ఎస్‌ పార్టీకే ఓటేస్తానని స్పష్టం చేశారు.

తెలంగాణలోని ఆంధ్రులంతా టీఆర్ఎస్‌కు ఓటు వేయాలని కోరారు. తెలంగాణ వాసులను మళ్లీ మోసం చేసేందుకే చంద్రబాబు వస్తున్నారని విమర్శించారు.బాబు మాటలు నమ్మి ఓటేస్తే మరో యాభై ఏళ్లు వెనక్కి వెళ్తారని పోసాని వ్యాఖ్యానించారు. దేశంలో చంద్రబాబు లాంటి మోసగాడు మరొకరు లేరని అన్నారు. చంద్రబాబు బతికి ఉన్నంత కాలం నిజాలు చెప్పరని....నిజం చెబితే తల వెయ్యి ముక్కలవుతుందని చంద్రబాబుకు శాపం ఉందని పోసాని తెలిపారు.చంద్రబాబు వ్యవస్థలను నిర్వీర్యం చేశారని దుయ్యబట్టారు.తెజస అధినేత కోదండరాం అంటే తనకు ఎంతో గౌరవమని.. అయితే ఆధారాలతో విమర్శలు చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.