కృష్ణంరాజుకు హార్ట్ ఆపరేషన్

 

ప్రముఖ నటుడు, కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు కృష్ణంరాజు అస్వస్థతకు గురయ్యారు. ఆరోగ్యంలో తేడాను గమనించిన కృష్ణంరాజు హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చేరారు. నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి డాక్టర్ శేషగిరిరావు నేతృత్వంలో వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. కృష్ణంరాజుకు ఆంజియోగ్రామ్ పరీక్ష నిర్వహించామని, గుండెకు రక్తాన్ని అందించే నాళాలు పూడుకుపోవడంతో స్టెంట్లు అమర్చామని వైద్యులు తెలిపారు. ఆయన స్వల్ప అనారోగ్యానికి మాత్రమే గురయ్యారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ప్రముఖ నిర్మాత రామానాయుడు మరణించిన షాక్‌లో అందరూ వుండగానే, సినీనటుడు చంద్రమోహన్ గుండెపోటుతో అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఇంతలోనే ఇలా కృష్ణంరాజు అనారోగ్యానికి గురయ్యారు. సినీరంగ ప్రముఖులు ఇలా వరుసగా అనారోగ్యానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.