రోడ్డు ప్రమాదం.. శారదకు గాయాలు

 

ప్రముఖ సినీనటి ‘ఊర్వశి’ శారద రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. నల్గొండ జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద శారద ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో శారద స్వల్పంగా గాయపడ్డారు. గతంలో ఇదే ప్రాంతంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగాయి. నందమూరి హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్‌ ఈ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలోనే మరణించారు. ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో గాయపడిన శారదకు స్వల్ప గాయాలే తగిలాయని తెలుస్తోంది. ఆమె ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదని సమాచారం.