అక్కడ అబ్రహాం.. ఇక్కడ ఇబ్రహీం

 

పాలమూరు రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. ప్రతి పార్టీలోనూ అసంతృప్తులు పెరిగిపోతున్నారు. పార్టీ హ్యాండిస్తే.. ఒక్క నిమిషం కూడా ఆలోచించడంలేదు ఆశావహులు. పార్టీ గోడ దూకేందుకు సిద్ధంగా ఉంటున్నారు. సీట్ల పంచాయితీ కారణంగా మహబూబ్ నగర్ జిల్లాలో జంపింగ్ జపాంగ్ ల హడావిడి జోరుగా ఉంది.

 

ఎంపీటీసీ, జెడ్పీటీసీ బీ ఫారాల విషయంలో తనను పట్టించుకోలేదని ఆలంపూరు కాంగ్రెస్ ఎమ్మెల్యే డాక్టర్ అబ్రహాం తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. అయినా పార్టీ అధినేతలు పట్టించుకోకపోవడంతో టీడీపీలో చేరారు. బాబు ప్రజాగర్జన సభలో పచ్చ కండువా కప్పుకున్నారు ఆలంపూర్ ఎమ్మెల్యే అబ్రహాం.

 

మరో వైపు మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి రెండుసార్లు తెరాస అభ్యర్ధి పోటీ చేసి ఓడిపోయిన సయ్యద్ ఇబ్రహీం టీఆర్ఎస్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు కూడా.. టీజీవో నేత శ్రీనివాస్ గౌడ్ తెరాసలో చేరడంతో ఇబ్రహీంకు గులాబీ బాస్ హ్యాండిచ్చారు. దీంతో ఇబ్రహీం అనుచరులు ఆందోళనకు దిగారు. అయినా తెరాస నేతలు స్పందించలేదు. తీవ్ర మనస్తాపం చెందిన ఇబ్రహీం చలో గాంధీభవన్ యాత్ర చేపట్టారు. ఇబ్రహీం కాంగ్రెస్ లో గూటికి చేరారు. మహబూబ్ నగర్ జిల్లాలో అక్కడ అబ్రహాం.. ఇక్కడ ఇబ్రహీం తప్పనిసరి పరిస్థితుల్లో గోడ రోజుల వ్యవధిలో అనూహ్యంగా పార్టీలు మారిపోయారు.