అబ్దుల్ కలాం కన్నుమూత... పుకారు కాదు...

 

భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మరణం యావత్ భారతదేశాన్ని విషాదంలో ముంచింది. అయితే గతంలో అనేక పర్యాయాలు అబ్దుల్ కలాం మరణించారంటూ పుకార్లు వచ్చాయి. ఒకసారి కాదు... రెండుసార్లు కాదు.. అనేకసార్లు ఆ పుకార్లు వచ్చాయి. ఆయన కిందపడిపోయి గాయపడ్డారని, ఐసీయులో వున్నారని... ఇలా అనేకసార్లు పుకార్లు వ్యాపించాయి. సోమవారం షిల్లాంగ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ కుప్పకూలారన్న వార్తలు మొదటిసారి వినప్పుడు ఈ వార్తలు కూడా గతంలో తరహాలో పుకార్లేనని చాలామంది భావించారు. అయితే అవి పుకార్లు కావు.. ఆయన నిజంగానే కన్నుమూశారన్న విషయం తెలుసుకుని భారత ప్రజల గుండెలు ఆవేదనతో బరువెక్కాయి.