కలాం జన్మదినాన్ని విద్యార్ధుల దినోత్సవంగా మార్చిన ఐకాస

 

భారత మిసైల్ మ్యాన్.. భారత క్షిపణి శాస్త్రవేత్త అబ్దుల్ కలాం నిన్న సాయంత్రం షిల్లాంగ్‌ ఐఐఎంలో ప్రసంగిసిస్తూ కుప్పకూలిపోయారు. అనంతరం కలాంను ఆస్పత్రికి తరలించిన కాసేపటికే తుదిశ్వాస విడిచారు. దీంతో భారత ప్రజలు ఒక్కసారిగా బాధలో మునిగిపోయారు. తన జీవిత కాలంలో ఎన్నో అవార్డులు సొంత చేసుకున్నారు అబ్దుల్ కలాం. ఇప్పుడు ఆయన జన్మదినాన్ని విద్యార్ధుల దినోత్సవంగా ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. కాగా అబ్దుల్‌కలాం పార్థివదేహం మంగళవారం ఢిల్లీలోని పాలెం విమానాశ్రయానికి చేరుకుంది. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉపరాష్ట్రపతి హమీద్‌ అన్సారీ, కేంద్ర రక్షణమంత్రి మనోహర్‌ పారికర్‌, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌, ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ నజీబ్‌జంగ్‌ తదితరులు నివాళులర్పించారు. మరికాసేపట్లో కలాం భౌతికకాయాన్ని ఆయన నివాసానికి తరలించనున్నారు.