ఛత్తీస్‌ఘడ్ పిసిసి చీఫ్ ను హత్య చేశారు

 

 

Abducted Chhattisgarh PCC chief Nand K Patel killed by Maoists

 

 

కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయాణిస్తున్న బస్సును పేల్చి, కాల్పులు జరిపి సల్వాజుడం వ్యవస్థాపకుడు మహేంద్రకర్మను చంపిన మావోయిస్టులు కిడ్నాప్ చేసిన ఛత్తీస్గఢ్ పిసిసి అధ్యక్షుడు నందకుమార్ను, ఆయన కుమారుడు దినేష్ను మావోయిస్టులు హత్య చేశారు. ఈ ఇద్దరి మృతదేహాలు సుకుమా జిల్లా దర్భా వద్ద లభ్యమైయ్యాయి. మావోయిస్టులు నిన్న మందుపాతరతో కాంగ్రెస్ నేతల కాన్వాయ్ని పేల్చివేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఘటనలో 25 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో గాయపడిన కేంద్ర మాజీ మంత్రి వీసీ శుక్లా పరిస్థితి విషమంగా ఉంది. నందకుమార్, దినేష్లను కిడ్నాప్ చేసి హత్య చేశారు.