లోక్ సభ ఎన్నికలకు 'ఆమ్ ఆద్మీ' సిద్ధం

 

 

 

లోక్ పాల్ బిల్లు కోసం ఢిల్లీలో అధికారాన్ని వదులుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ లోక్ సభ ఎన్నికలపై దృష్టి పెట్టింది. దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్, బీజేపీలకు గుణపాఠ౦ చెప్పాలని భావిస్తోంది. కేజ్రీవాల్ నేతృత్వంలో లోక్ సభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నామని ఆ పార్టీ నేత యోగేంద్ర యాదవ్ తెలిపారు. 'ఝాడూ చలావ్‌యాత్ర' పేరుతో ఈ నెల 23 నుంచి దేశంలోని లోక్ సభ నియోజకవర్గాల ప్రచార హోరుకు ఆప్‌వర్గాలు సిద్దమవుతున్నాయి. అవినీతిపై కాంగ్రెస్, బీజేపీల తీరును ఎండగట్టేందుకు ఆప్ సిద్ధమవుతోంది. కాంగ్రెస్, బీజేపీల వల్లే తమ ప్రభుత్వం కుప్పకూలిందని ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ మండిపడ్డారు. జన్‌లోక్‌పాల్‌ను అమలు చేయడమే తమ ప్రాధాన్యాంశమని, ఆ బిల్లునే అడ్డుకున్న తర్వాత అధికారంలో ఉండి ప్రయోజనం లేదని ఆయన అన్నారు.