ఆమ్ ఆద్మీ పార్టీ ‘ప్రాజెక్ట్ 101’

 

 

 

ఆమ్ ఆద్మీ పార్టీకి పార్లమెంట్‌లో పెద్దగా సీన్ లేకపోయినప్పటికీ మోడీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడానికి తీవ్రంగా క‌ృషిచేస్తామని చెబుతోంది. తమ పార్టీ సభ్యుల సంఖ్య తక్కువ (4) అయినప్పటికీ మోడీ ప్రభుత్వానికి ఊపిరాడకుండా చేయడంలో సక్సెస్ అవుతామని సదరు పార్టీ లోక్ సభ సభ్యులు చెబుతున్నారు. నరేంద్రమోడీ తాను ప్రధాని అయిన తర్వాత వంద రోజుల్లో దేశంలోని పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తామని చెప్పిన పాయింట్‌ని ఆప్ ఆద్మీ గట్టిగా పట్టేసుకుంది. ఈ స్టేట్ మెంట్ ఆధారంగా ‘ప్రాజెక్ట్ 101’ అనే పథకాన్ని రెడీ చేసింది. దీని ప్రకారం మోడీ అధికారం చేపట్టి వంద రోజులు పూర్తి కాగానే 101వ రోజు నుంచి మోడీ సర్కారును నిలదీయడం ప్రారంభిస్తుంది. ఆ వంద రోజుల్లో మోడీ ప్రభుత్వం పనితీరును సమీక్షిస్తుంది. ఈ విషయాన్ని ఆప్ ఎంపీలు చెప్పారు. దేశం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు పేదరికం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణమని చెప్పారు. ఈ సమస్యలను పరిష్కరించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ పార్లమెంట్ సభ్యులు అంటున్నారు.