కొండగట్టు వద్ద బస్సు బోల్తా.. 32 మంది మృతి

 

జగిత్యాల జిల్లా కొండగట్టు ఘాట్‌రోడ్డులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.. ఘాట్‌రోడ్డులోని మలుపు వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ఘటనలో 32 మంది మృతిచెందినట్లు సమాచారం.. మరికొందరు తీవ్రంగా గాయపడగా వారిని జగిత్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 60 మందికి పైగా ఉన్నట్లు తెలుస్తోంది.. ప్రమాద సమాచారం తెలియగానే జగిత్యాల జిల్లా కలెక్టర్‌ శరత్‌, ఎస్పీ సింధూశర్మ హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు.. ఈ ప్రమాదంపై ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. క్షతాగాత్రులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు.