కాంగ్రెస్ కు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా

 

 

 

కాంగ్రెస్ పార్టీకి మరో ముగ్గురు సీమాంధ్ర ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన వారిలో ఎమ్మెల్యేలు ఆదాల ప్రభాకర్‌రెడ్డి, శ్రీధర్ కృష్ణారెడ్డి, బండారు సత్యానందరావు ఉన్నారు. వీరు తమ రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, పీసీసీ ఛీఫ్ బొత్స సత్యనారాయణకు ఫ్యాక్స్ ద్వారా పంపించారు. ఇక ఇప్పటికే రాజమండ్రి ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ను కాంగ్రెస్ పార్టీ నుండి బహిష్కరించినందుకు నిరసనగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ తన పదవికి రాజీనామా చేశారు. గురువారం ఉదయం తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణకు లేఖను అందించారు. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి గడ్డు పరిస్థితులు ఎదురయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి.