ఏలూరులో పుంజుకున్న తెలుగుదేశం

 

 

 

ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ పుంజుకుంది. ఈ కార్పొరేషన్‌లో కౌంటింగ్ మొదలైన కాసేపటికి వైసీపీ ఆధిక్యం కనిపించింది. తెలుగుదేశం పార్టీ వెనుకబడిపోయింది. సీమాంధ్ర అంతటా తెలుగుదేశం పార్టీ మంచి ఫలితాలు సాధిస్తున్న దశలో ఏలూరు కార్పొరేషన్‌లో మాత్రం వైకాపా అనుకూలత కనిపించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కొంత సమయం గడిచిన తర్వాత ఏలూరులో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం పార్టీ వైకాపాని దాటుకుని ముందుకు వెళ్ళింది. ఏలూరు కార్పొరేషన్‌‌లోని 45 స్థానాల్లో ‌16 స్థానాల్లో తెలుగుదేశం ఆధిక్యంలో వుండగా, వైకాపా 5 స్థానాల్లో ఆధిక్యంలో వుంది.