కిలోలకు కిలోలు బంగారు బిస్కట్లు...

 

కర్నూలు నుంచి బెంగళూరుకు అక్రమంగా తరలిస్తున్న సుమారు 16 కిలోల బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా బంగారాన్ని తరలిస్తున్నట్లు ముందుగానే సమాచారం అందడంతో పోలీసులు రంగంలోకి దిగి పదహారు కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సంగతి ఇలా వుంటే హైదరాబాద్‌లో ఓ బంగారు వ్యాపారి తన షాపులో వున్న ఎనిమిది కిలోల బంగారాన్ని ఎవరో దొంగిలించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.